SAKSHITHA NEWS

Defense of Indian Constitution – Training Classes

భారత రాజ్యాంగ రక్షణ – శిక్షణా తరగతులు
సాక్షిత పెద్దపల్లి బ్యూరో :

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశంలోని ప్రజలందరూ సమాన హక్కులతో జీవించాలనే తలంపుతో మనకందించిన భారత రాజ్యాంగాన్ని BJP, RSS లు సమూలంగా మార్చి దాని స్థానంలో మనుధర్మాన్ని తీసుకురావడానికి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టి భారత రాజ్యాంగాన్ని అలాగే SC, ST, BC, మైనార్టీ లకు డా. బి. ఆర్.అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను రక్షించుకోవడానికి నేటి యువతరాన్ని సిద్దం చేయడానికి తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో “భారత రాజ్యాంగ రక్షణ” పై రెండు రోజుల శిక్షణ తరగతులు చొప్పందండి మండలంలోని గుమ్లపూర్ లో ఏర్పాటు చేస్తున్నారు.

ఈ రెండు రోజుల భారత రాజ్యాంగ రక్షణ శిక్షణా తరతులను తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ , తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి శిక్షణ తరగతులకు ప్రొఫెసర్లు, మేధావులచే నిర్వహించబడునని ,

ఈ కార్యక్రమానికి స్థానిక మంత్రి శాసనసభ్యులు, జడ్పీటీసీలు , ఎంపీపీలు మరియు ప్రజా ప్రతినిదులను SC , ST ,BC, మైనార్టీ, రెడ్డి, వెలమ సంఘాల నాయకులను అహ్వానిస్తున్నమని, ఈ సందర్భంగా రామగిరి మండల ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ కి, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ మండల ప్రధాన కార్యదర్శి బొంకూరి పోచం ఆహ్వాన పత్రం అందచేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నాయకులు మొకనపెల్లి సమ్మయ్య, నాగుల కృష్ణ, అరెంద కుమార్ , గుద్దేటి ప్రభాకర్ , తోగరి స్వామి మొదలగువారు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS