SAKSHITHA NEWS


Nai is an MLA who participated in the Brahmin Sankalpa Diksha and expressed solidarity

నాయి బ్రాహ్మణ సంకల్ప దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే

కార్పొరేట్ సెలూన్ల ఏర్పాటును తీవ్రంగా ఖండిస్తూ కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వద్ద కుత్బుల్లాపూర్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 5వ రోజు చేపట్టిన నాయి బ్రాహ్మణ సంకల్ప దీక్షలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుంటానని చెప్పారు. నాయి బ్రాహ్మణుల విజ్ఞప్తి మేరకు కార్పొరేట్ సెలూన్లను ఏర్పాటు చేయకుండా, ప్రభుత్వం ద్వారా జీవో జారీ చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంకల్ప దీక్ష బి.శ్రీనివాస్ నాయి, రిజిస్ట్రేషన్ నెంబర్ 579/2021 అధ్యక్షుడు ఏ.రేణయ్య నాయి, ప్రధాన కార్యదర్శి కే.పరమేష్ నాయి, చైర్మన్ ఎస్ రవిబాబు నాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.సురేష్ నాయి, క్యాషియర్ వి.మహేందర్ నాయి, మీడియా ప్రచార కార్యదర్శి బంటు ప్రవీణ్ నాయి,

సలహాదారులు ఎం.బిక్షపతి నాయి, ఉపాధ్యక్షుడు ఎస్ఎంఎస్ సురేష్ నాయి, యు.హనుమంతు నాయి, జాయింట్ సెక్రెటరీ జి.వెంకటేష్ నాయి, టీ.కుమార్ నాయి, అధ్యక్షుడు మైలారం యాదగిరి నాయి, సురేందర్ నాయి, తెలంగాణ రాష్ట్ర ప్రజా యువజన యువశక్తి నాయి, బ్రాహ్మణ సేవా సంఘం సుచిత్ర శ్రీ బాలాజీ నాయి, బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు V.S.R.వెంకట్, సుచిత్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఏ.సాయి నాయి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS