కొయ్యలగూడెం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ .

Spread the love

కొయ్యలగూడెం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …


మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముత్యాలమ్మ పరిసరాలు, వినాయకుడి ఆలయ పరిసరాలలో ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అందుబాటులో ఉండే అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రజలతో సమావేశమై కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంల ప్రజాప్రతినిధులు, వార్డుల ఇంచార్జ్ లు, గ్రామ పెద్దలు, ప్రజలు, పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page