3 రాజధానులు కంటే 3 రాష్ట్రాలు మేలేమో: జగ్గారెడ్డి

Spread the love

3 states are better than 3 capitals: Jaggareddy

3 రాజధానులు కంటే 3 రాష్ట్రాలు మేలేమో: జగ్గారెడ్డి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానులకంటే 3 రాష్ట్రాలు చేస్తే మేలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అలా చేస్తే సీఎం పదవి కోసం జగన్‌ కుటుంబంలో ఉన్న గొడవ తీరుతుందన్నారు.

మూడు రాష్ట్రాల్లో.. ఒకచోట జగన్‌, ఇంకో చోట షర్మిల, మరో చోట విజయసాయి సీఎం కావచ్చు. ‘‘కుటుంబ పంచాయితీని జగన్‌, షర్మిల తెలంగాణకు వచ్చి పెట్టడం సరికాదు. అవసరమైతే మోదీతో మాట్లాడి.. సమస్యను పరిష్కరించుకోవాలి.

నన్ను కోవర్ట్‌ అని షర్మిలే కాదు.. మా పార్టీ వాళ్లూ అన్నారు. షర్మిల నా జోలికి రాకుంటే నేను ఆమె జోలికి వెళ్లను’’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Related Posts

You cannot copy content of this page