SAKSHITHA NEWS

63.00 Lakhs at AS Raju Nagar under Hyder Nagar Division

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఏ ఎస్ రాజు నగర్ వద్ద షుమారు 63.00 లక్షల రూపాయల అంచనా వ్యయంలో భాగంగా, డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .

ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఏ ఎస్ రాజు నగర్ కాలనీ లో డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది అని, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అదే విదంగా డ్రైనేజ్ పైప్ లైన్ పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, జలమండలి అధికారులకు, కాంట్రాక్టర్కు తగు సూచనలు చేసిన నార్నె శ్రీనివాసరావు . ఈ కార్యక్రమంలో జలమండలి సూపర్వైజర్ నరేంద్ర, చిరంజీవి రాజు, రాజు సాగర్, కృష్ణ, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS