ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ

SAKSHITHA NEWS

Free distribution of note books to government school students

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ


మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు* దాతల సహకారంతో రూపొందించిన నోటు పుస్తకాలను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేసేందుకు శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి సీసల బస్తిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బేబీ, నాయుడు, డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు రుద్ర అశోక్, రాజకుమార్, సంతోష్, హాజీ, పెయింటర్ రాజు, మురళి, సత్తిరెడ్డి, తెరాస పార్టీ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page