కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై నిర్మలా సీతారామన్ ఫైర్

Spread the love

సాక్షిత : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని బీర్కూర్ లో రేషన్ షాపును నిర్మలా సీతారామన్ తనిఖీ చేశారు. రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత అని కలెక్టర్ జితేష్ పాటిల్ ను ఆమె ప్రశ్నించారు. దీనికి కలెక్టర్ తెలియదని సమాధానమిచ్చారు. కలెక్టర్ అయ్యుండి తెలియదంటారా అని నిర్మలా సీతారామన్ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరగంటలో తెలుసుకుని చెప్పాలని కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే రేషన్ షాపులో ప్రధాని మోడీ ఫోటో లేకపోవడాన్ని నిర్మలా సీతారామన్ గమనించారు. మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని కలెక్టర్ ను ఆమె ప్రశ్నించారు. మోడీ ఫ్లెక్సీ పెట్టకపోతే సాయంత్రం నేనే వచ్చి కడతానని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020 మార్చి నుంచి పేదలకు కేంద్రమే ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోందని ఆమె తెలిపారు.

Related Posts

You cannot copy content of this page