SAKSHITHA NEWS

ఆలయ భవన సముదాయంను ప్రారంభించిన ఎమ్మెల్యే…

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.6 లక్షల విరాళం…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ శ్రీ రామ లింగేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన ఆలయ భవన సముదాయంను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ మరియు మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన తల్లిదండ్రులు స్వర్గీయ కేఎం పాండు, శ్యామలమ్మ జ్ఞాపకార్థం రూ.6 లక్షల రూపాయల విరాళాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, నిజాంపేట్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, ఆలయ కమిటీ ప్రతినిధులు జల్దా రాఘవులు, రాజేందర్, సత్యనారాయణ, శ్రీనివాస్ గౌడ్, తిమ్మయ్య, జల్దా లక్ష్మీనాథ్, ఎల్లయ్య, రాములు, సత్యనారాయణ, నర్సింహా, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య, రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు గౌసుద్దిన్, సంపత్ మాధవ రెడ్డి, కస్తూరి బాల్ రాజ్, గుమ్మడి మధుసూదన్ రాజు, సయ్యద్ రషీద్, మారయ్య, సుధాకర్, అబ్దుల్ ఖాదర్, కార్తిక్ గౌడ్, సతీష్ గట్టోజి, భిక్షపతి, బాలయ్య, చింతయ్య, వెంకట సాయి, జగన్, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS