SAKSHITHA NEWS

సూర్యనగర్ కాలనీలో అధికారులతో ఎమ్మెల్యే పర్యటన…

భూగర్భడ్రైనేజీ ఔట్ లెట్ సమస్య పరిష్కారానికి కృషి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని సూర్యనగర్ కాలనీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ధికారులతో కలిసి పర్యటించారు. మొదటగా శ్రీ శక్తి గణపతి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం గత కొన్ని నెలలుగా నెలకొన్న భూగర్భడ్రైనేజీ ఔట్ లెట్ సమస్యను స్థానిక మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ కృష్ణ చైతన్య, వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్ రెడ్డి, డిసీపి సాంబయ్య, డిఈఈ పాపమ్మ, డిజిఎం రాజేష్ మరియు మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ టీ.అశోక్ గౌడ్, జనరల్ సెక్రెటరీ వి.సురేష్, ట్రెజరర్ మోహన్ లాల్, శివయ్య, బాబూ రావు, ఉపేందర్ రెడ్డి, హృదయ్ రాజ్, యాదవ రెడ్డి, రమణారావు, పాపిరెడ్డి, మధుకర్ రెడ్డి, జయంచారి, వెంకటేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS