
దేశంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం, అడ్డగోలుగా పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, జిఎస్టీ పెంపు, నిరుద్యోగం, అగ్నిపథ్, రాష్ట్రంలో వరదలు తదితర అంశాలపై ఏఐసీసీ పిలుపు మేరకు రాజభవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ప్రదర్శన కు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో తరలివెల్లిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు.
ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు పరశురాం గౌడ్, డీసీసీ ఆర్గనైజింజ్ సెక్రటరీ సాల్మన్ రాజు, యువజన కాంగ్రెస్ నాయకులు కుంటు సుమన్, జీవన్,మిద్దెల సీతారాం రెడ్డి, బైండ్ల దయానంద్, అక్బర్, అజిజ్ మరియు NBR యువసేన సభ్యులు పాల్గొన్నారు.
