
సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన ప్రజా ప్రతినిధులు మరియు వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలు వారి దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా పలు ఆహ్వాన పత్రికలు కూడా అందజేశారు. ఈ మేరకు సమస్యలపై ఎమ్మెల్యే స్పందించి ఆయా సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేశారు.
