వైసిపి కి రోజులు దగ్గర పడ్డాయి

Spread the love

బాపూజీ నగర్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం

నంద్యాల మండలం బాపూజీ నగర్ గ్రామంలో శంఖారావం కిట్లను పంపిణీ చేయడం జరిగిందని మాజీ మంత్రి నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ తులసి రెడ్డి తెలియజేశారు

ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ గ్రామాలను , పట్టణాలను అభివృద్ధి చేయడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని అభివృద్ధి అంటేనే వైసిపికి గిట్టదు అన్నారు . బాపూజీ నగర్ లో గత తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చేసిన రోడ్లు , డ్రైనేజీ , వాటర్ ట్యాంక్ , వీధి దీపాలు తప్ప ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదా అని తెలియజేశారు . కాబట్టి ప్రజలందరూ గమనించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి సీఎంగా చంద్రబాబు నాయుడు ని నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫరూక్ ని గెలిపించుకుంటే బాపూజీ నగర్ కు కావలసిన అన్ని సౌకర్యాలను మేము ఏర్పాటు చేస్తామని అలాగే బాపూజీ నగర్ కు ప్రత్యేకంగా స్మశాన వాటిక మరియు ప్రత్యేక బూత్ కూడా ఏర్పాటు చేస్తామని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page