లోకేశ్‌ కాన్వాయ్‌ను ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు ఆపారు

Spread the love

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌ను ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు ఆపారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నామని చెప్పడంతో ఆయన సహకరించారు. కాన్వాయ్‌లోని కార్లు అన్నింటినీ తనిఖీ చేసి కోడ్‌కు విరుద్ధంగా ఏమీలేదని పోలీసులు నిర్ధరించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేశ్‌ ప్రచారం సాగుతోందని ధ్రువీకరించారు. తాడేపల్లిలోని అపార్ట్‌మెంట్‌ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తుండగా ఈ తనిఖీలు జరిగాయి.

Related Posts

You cannot copy content of this page