SAKSHITHA NEWS

వైసీపీకి మరో షాక్ గుంటూరు జిల్లా కీలక నేత టీడీపీ లోకి

గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక చక మార్పులు జరుగుతున్నాయి గత ఇరవై సంవత్సరాలనుండి వైసీపీకి కీలకంగా వ్యవ్యహరించిన కీలక నేత భరత్ రెడ్డి టీడీపి లోకి వెళ్తున్నారని సమాచారం, భరత్ రెడ్డి గుంటూరు జిల్లాలో యువ నాయకుడు తనకు ఊహ తెలిసిన నాటి నుండి ysr అభిమాని గా కాంగ్రెస్ అభిమానిగా తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాడు అక్కడి నుంచి ysr తరువాత జగన్ మోహన్ రెడ్డి మొదలు పెట్టిన పార్టీ ysrcp కి గుంటూరు జిల్లాలో దాదాపు గా ఇరవై వేల మందితో ర్యాలీ నిర్వహించి జగన్ అభిమానానికి పాత్రుడు అయ్యాడు ఆలా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకొన్న వ్యక్తి భరత్ రెడ్డి, ఎవరి అండ లేకుండా ఒంటరిగా తన శైలిలో రాజకీయ నేతగా ఎదిగిన వ్యక్తి భరత్ రెడ్డి ఆలా గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడిగా ఏదిగాడు, ysr కుటుంబం మీద అంత అభిమానం ఉన్న వ్యక్తి భరత్ రెడ్డి ఇప్పుడు అనూహ్యంగా పార్టీ మారడం ysrcp కి గట్టి దెబ్బే అనిపిస్తుంది, భరత్ రెడ్డి టీడీపిలో చేరితే గుంటూరు రాజకీయాల్లో పెను మార్పులు తప్పవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏది ఏమైనా టీడీపీలో భరత్ రెడ్డి మార్క్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి

అల్ ది బెస్ట్ టూ భరత్ రెడ్డి
బీరం తేజోమూర్తి
ఎడిటర్
సాక్షిత


SAKSHITHA NEWS