SAKSHITHA NEWS

చిత్తశుద్ధి గల బహుజన నాయకుడికి ఓటు వేసి గెలిపించండి…

నెట్టెంపాడు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి గొంగళ్ల సాహితమ్మ .. ధరూర్ : మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి గొంగళ్ల రంజిత్ కుమార్ గారి సతీమణి గొంగళ్ల సాహితమ్మ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం కొనసాగించారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుండి చిత్తశుద్ధి గల బహుజన నాయకుడు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగళ్ల రంజిత్ కుమార్ సింహం గుర్తు ద్వారా పోటీ చేస్తున్నారని ఈ సందర్భంగా గద్వాల ప్రజలు అవకాశం ఇచ్చి గద్వాల కోటపైన బహుజన జెండాను ఎగరేయటానికి ప్రతి ఒక్కరూ పూర్తి మద్దతు తెలిపి ఆశీర్వదించాలని గ్రామస్తులను కోరారు.

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లామహిళా నాయకురాలు రేణుక యాదవ్ ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు, ఉపాధ్యక్షులు మునెప్ప, ఆంజనేయులు, కార్యదర్శి రాము, సహాయ కార్యదర్శి చిన్న తిప్పన్న,గ్రామ నాయకులు ఎల్లప్ప, గుడిసె శివన్న, మాలింగప్ప,ప్యాట్ల రాములు, రమేష్,దేవన్న,నాగేష్,మాబన్న,ఎల్లప్ప,నక్క,దొబ్బల హనుమంతు, బోరింగ్ మల్లేష్, మహేష్, లాలు ప్రసాద్,చిన్న దేవన్న,సురేష్, శివ కుమార్, బ్యారం శివన్న,బ్యారం రామకృష్ణ,సాంభన్న, సాయి మరియు గ్రామ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 23 At 3.18.49 Pm

SAKSHITHA NEWS