SAKSHITHA NEWS

అలంపూర్ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న….

నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్…

అలంపూర్: నియోజకవర్గం వడ్డేపల్లి మండలంలోని శాంతినగర్ లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అలంపూర్ సమన్వయకర్తలు నాగేష్ యాదవ్,గౌనింటీ వీరెశ్ అధ్యక్షతన జరిగిన అలంపూర్ ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా శాంతినగర్ లో ఆయనకు పెద్ద ఎత్తున డోళ్ల దరువులతో ఘన స్వాగతం పలికారు.. అనంతరం మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ….

రెండు జీవనదుల మధ్య ఏర్పడిన అలంపూర్ మరియు గద్వాల ప్రాంతంలో ఆధిపత్య కులాలకింద అణచివేతకు గురైన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ పేద వర్గాల ప్రజల తరపున అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఒక వేదికగా నడిగడ్డ ప్రాంతంలో ప్రశ్నిస్తుందని ఆయన అన్నారు.

అధికారం అడ్డంపెట్టుకుని ఆధిపత్య కులాలు బహుజనులను అడుగడుగునా అడ్డుపడుతూ,రాజకీయంగా,ఆర్థికంగా, విద్యాపరంగా,వైద్య పరంగా,సామాజికంగా, సంక్షేమం అభివృద్ధి పరంగా ఎదగనీయకుండా అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
అలంపూర్ నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఆధిపత్య కులాలు ఈ ప్రాంతంలో రాజ్యమేలుతున్నాయని,అలాంటి వారిని ఈ ప్రాంతం నుండి తరిమికొట్టాలని కోరారు.నూటికి 90 శాతం ఉన్న బహుజనులు ఎందుకు రాజకీయంగా ముందుకు పోవడం లేదని,నడిగడ్డ ప్రజల ఆత్మగౌరవం కోసం నడిగడ్డ హక్కుల పోరాట సమితి ప్రశ్నిస్తూనే ఉంటుందని అన్నారు.
రాబోయే రోజుల్లో అలంపూర్ నియోజకవర్గంలో నీతి నిజాయితీతో మరియు చిత్తశుద్ధితో పనిచేసే స్వతంత్ర బహుజన నాయకత్వం కోసమై, నడిగడ్డ హక్కుల పోరాట సమితి పనిచేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు,అలంపూర్ కన్వీనర్ క్రాంతిదళ్ నాగేష్ యాదవ్,కో కన్వీనర్ గౌనింటి వీరేష్,అలంపూర్ తాలూకా నాయకులు దొడ్డన్న,వడ్డేపల్లి మండల ఇంఛార్జి బంగారు కిషోర్,అయిజ మండల ఇంచార్జి రవి యాదవ్, రాజోలి మండల ఇంచార్జి బోయ వీరేష్,ఉండవెల్లి మండల ఇంఛార్జి వెంకటేష్,జిల్లా నాయకులు లవన్న,విజయ్ కుమార్,తిమ్మప్ప,కవి అవని శ్రీ,రంగ స్వామి,వీరితోపాటు మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్,నజుముల్లా, కార్యదర్శి తిమ్మప్ప, ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు,ఉపాధ్యక్షులు మునెప్ప,ఆంజనేయులు, కార్యదర్శి రాము,గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు,ఉపాధ్యక్షుడు దయాకర్,కె.టి.దొడ్డి మండల నాయకులు అంజి,భీమన్ గౌడ్,దస్తగిరి గౌడ్,జ్ఞానేశ్వర్, ఎల్లేష్, ఆయా గ్రామాల కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు,కార్యదర్శిలు,సభ్యులు,నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 16 At 5.51.12 Pm

SAKSHITHA NEWS