75 వ వజ్రోత్సవ వేడుకల్లో సామూహిక గీతాలాపన కార్యక్రమం

Spread the love

సైదాపూర్ మండల కేంద్రంలో

సామూహిక గీతాలాపన

సాక్షిత సైదాపూర్ కరీంనగర్ జిల్లా

75 వ వజ్రోత్సవ వేడుకల్లో సామూహిక గీతాలాపన కార్యక్రమంలో భాగంగా 16వ తేదీన ఉదయం 11:30 గంటలకు జనగణమన గీతాలాపన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద రాష్ట్ర ఎంపీపీల పోరం అధ్యక్షుడు సైదాపూర్ మండలం ఎంపీపీ సారా బుడ్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గీతాలాపన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, ఎమ్మార్వో సదానందం ఎంపీడీవో పద్మావతి,ఎంపీ ఓ రాజశేఖర్ రెడ్డి,సైదాపూర్ ఎస్సై జున్ను ఆరోగ్యం మరియు జంట గ్రామాల సర్పంచులు చందా శ్రీనివాస్ కొండ గణేష్ మరియు జంట గ్రామాల ఎంపీటీసీలు తొంట ఓదెలు,జంపాల సంతోష్ వార్డు సభ్యులు ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు కార్యకర్తలు అభిమానులు రాజకీయ నాయకులు,ప్రజలు యువకులు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

అలాగే బోర్నపల్లి (లోకేటెడ్ సైదాపూర్) బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ తాడూరి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పిల్లలతో పాటు గీతాలపన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి సాగర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page