సున్నం చెరువుసఫ్దర్ నగర్ 5 కోట్ల 20 లక్షల

Spread the love

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ సున్నం చెరువు నుండి సఫ్దర్ నగర్ వరకు 5 కోట్ల 20 లక్షలతో నిర్మిస్తున్న పక్కా నాలా పనులను సర్వే నం 18 వద్ద పరిశీలించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ నాలా పక్కా లేకపోవటం వల్ల చిన్న వరద వచ్చిన సున్నం చెరువు చుట్టూ పక్కల ఉన్న కాలనీలు పద్మావతి నగర్ ,మెహ్రాజ్ నగర్ , గాయత్రి నగర్, జ్యోతి నగర్ నీట మునిగి ఇబ్బంది పడేవాళ్ళు అని ,ఈ నాలా పక్కా నిర్మాణంతో ఎంతటి పెద్ద వరద వచ్చిన పద్మావతి నగర్ ,మెహ్రాజ్ నగర్ , గాయత్రి నగర్, జ్యోతి నగర్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికీ భద్రత ఉంటుంది అని అన్నారు.

ఈ కార్యక్రమం లో డివిజన్ కో ఆర్డినేటర్ టి వీరా రెడ్డి ,ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్, బస్తి అధ్యక్షులు జావీద్ , కమల్ వాసన్,మొయిజ్,మల్లికార్జున్ ,సోషల్ మీడియా అధ్యక్షులు యోగిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page