SAKSHITHA NEWS

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 4విడతల్లో కలిపి 48 కోట్ల 84 లక్షల రూ అందజేయడం జరిగింది – యువనేత

ఉదయం 10:00 గంటలకు, శ్రీకాకుళం, గార మండలం,
ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రియతమ నేత రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు మరియు
యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ
ఈనాడు ఇంతమంది అక్కచెల్లెమ్మల కల్లలో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషకరంగా ఉంది…
దీని అంతటికి కారణం మీ అందరికీ తెలుసు మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రవేశపెట్టిన ఈ వైయస్సార్ చేయూత పథకాన్ని ద్వారా ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏడాది 18750 రూ || చప్పున నాలుగు విడతల్లో 75 వేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది…..
మీ అందరి అవసరాల నిమిత్తం, చిరు వ్యాపారుల యొక్క వినియోగం కొరకు, మరియు అనేక అభివృద్ధి కార్యక్రమాల కొరకు, మీ గృహంలో అనేక అవసరాల నిమిత్తం వచ్చే లబ్దిని మీ అందరూ సద్వినియోగ పరుచుకుంటున్నారు.
ఈనాడు మీ అందరు ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా మీ యొక్క అవసరాలని తీర్చుకోగలుగుతున్నారంటే ఒక్క కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన చేయూత కార్యక్రమం.
ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు మీరందరూ అందుకున్నారు,
ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్న,
పేదల ప్రభుత్వం మళ్లీ రావాలన్నా,
మీరందరూ కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మరియు నాన్న ధర్మాన ప్రసాదరావు కి అండగా ఉండాలి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలి.


ప్రతిపక్షాలు అనేక దొంగ హామీలు ప్రవేశపెడుతున్నాయి,
మిమ్మల్ని అందరిని మోసపుర్చడానికి సూపర్ సిక్స్ అనే కొత్త హామీలను ప్రవేశపెట్టారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు మళ్లీ ఇప్పుడు కొత్త హామీలతో మీ ముందుకు వస్తున్నారు అటువంటి దొంగ హామీలను గాని మోసపూరితమైనటువంటి మాటలను గాని మీరు ఎవ్వరు నమ్మొద్దు.
ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన పేదల ప్రభుత్వంను విడిచి పెట్టుకుంటారో , ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తోడుగా ఉంటారో ఇంక మీ ఇష్టానికే వదిలేస్తున్నాం.
కానీ ఒక్కటి ఆలోచించండి అభివృద్ధి జరగాలన్న,
మీ అందరి కలలు నెరవేరాలన్న,
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ అండగా ఉండాలి.
ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్న వాలంటీర్ వ్యవస్థ గాని సచివాలయం వ్యవస్థ గాని మీ అందరికీ అందుబాటులో ఉండాలన్న మీరందరూ నాన్న ధర్మాన్ని ప్రసాదరావు కి తోడుగా ఉండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి….


మీరందరూ ఒక్కసారి గమనించండి అమ్మఒడి పథకం అయితేనేమి వైయస్సార్ ఆసరా అయితే నేమి వైఎస్ఆర్ చేయూత అయితే నేమి ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ గడప వద్దకు ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా తీసుకొస్తున్నాం.
వైయస్సార్ ఆసరా ద్వారా ఇంటి వద్దకే పాలన,
వైయస్సార్ ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటి వద్దకే వైద్యం,
రేషన్ ఇంటి వద్దకు ఉదయాన్నే ఏడో గంటకు తీసుకొస్తున్నాం.
అవ్వ తాతలకు పెన్షన్ ఉదయాన్నే ఏడో గంటకి వాలంటరీ వ్యవస్థ ద్వారా తీసుకొస్తున్నాం,
ఇవన్నీ మార్పులు కావా ఇవన్నీ అభివృద్ధి కావా ఈ అభివృద్ధి మళ్లీ జరగాలన్న కొనసాగాలన్న మీరందరూ అండగా నిలవాలి…
వైయస్ జగన్మోహన్ రెడ్డి మీ అందరి కల్లలో ఆనందం చూడటానికి మీ జీవితాల్లో అనేక అభివృద్ధి జరగడానికి మీ భవిష్యత్తు గ్యారెంటీగా నిల్చొని ఇంతవరకు బటన్ నొక్కి మీ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇకనుండి మీ వంతు రాబోయే ఎన్నికల్లో మీ యొక్క ఓటును వినియోగించి ఫ్యాన్ గుర్తుకి రెండు బటన్స్ నొక్కి వైఎస్సార్ ప్రభుత్వానికి అండగా నిల్చండి అని మాట్లాడిన యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ….
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు…..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP


SAKSHITHA NEWS