మియాపూర్ లో అవంతిక గ్రూప్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10కే ,5కే ,2కే మియాపూర్ రన్

Spread the love

మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ లో అవంతిక గ్రూప్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10కే ,5కే ,2కే మియాపూర్ రన్ ను గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి రన్ ను ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ అవంతిక గ్రూప్ వారు చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మాన్ని కొనియాడారు.అదేవిధంగా శారీరక శ్రమ తో పాటు మానసిక ఉల్లాసం ఎంతో అవసరం అని ,క్రీడలు శారీరక శ్రమ తో పాటు మానసిక ఆరోగ్యము ఎంతగానో ఉపయోగపడుతుంది అని, ఆరోగ్య‌క‌ర‌మైన స‌మాజం కొర‌కు ఇటువంటి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గాల‌ని ప్రభుత్వ విప్ గాంధీ గారు అభిల‌షించారు. ర‌న్ సంద‌ర్భంగా కాల‌నీ పిల్ల‌లు, యువ‌త‌, పెద్ద‌లు, మ‌హిళలు పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంతో ఉద‌య‌మే గ్రౌండ్‌కు చేరుకున్నారు. ఉద‌యం నుండే ప్రాంగ‌ణ‌మంతా పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఈ కార్యక్రమంలో అవంతిక గ్రూప్ ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి మరియు శిరీష తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page