వైయస్సార్ ఆసరా మూడవ విడత సంబరాలు కార్యక్రమం

Spread the love

ఉమ్మడి ప్రకాశం జిల్లా

వైయస్సార్ ఆసరా మూడవ విడత సంబరాలు కార్యక్రమం , లింగసముద్రం మండలంలోని లింగసముద్రం mro వారి కార్యాలయం ప్రాంగణంలో *,
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైయస్ఆర్ ఆసరా మూడవ విడత సంబరాలు కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2:00 గంటలకు లింగసముద్రం మండల రెవిన్యూ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు శాసన సభ్యులు * మానుగుంట మహీధర్ రెడ్డి హాజరై లింగసముద్రం మండలానికి చెందిన 784 స్వయం సహాయక సంఘాల గ్రూపులకు 8 కోట్ల 47 లక్షల రూపాయలను విడుదల చేయడం జరిగింది.


ఈ కార్యక్రమంలో లింగసముద్రం మండల డ్వాక్రా ఏపీఎం కే సింహాద్రి రావు , డ్వాక్రా సంఘ మండల అధ్యక్షురాలు బేరి రమణమ్మ లింగసముద్రం ఎంఆర్ఓ , ఎంపీడీఓ , ఎంపీపి పెన్నా కృష్ణయ్య, జేడ్పీటీసి నళిని పద్మ , జేసీఎస్ మండల కన్వీనర్ వరికూటి కృష్ణారెడ్డి లింగసముద్రం మండల కన్వీనర్ పిచ్చపాటి తిరుపతిరెడ్డి బ్యాంకు అధికారులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసిలు, అభిమానులు, కార్యకర్తలు, లబ్దిదారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page