రాష్ట్ర ప్రజలకు రానున్న రోజుల్లో కూడా మరింత మేలు జరగాలంటే మరో మారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

Spread the love

రాష్ట్ర ప్రజలకు రానున్న రోజుల్లో కూడా మరింత మేలు జరగాలంటే మరో మారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉండాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

చందర్లపాడు గ్రామంలో బుధవారం రాత్రి బూత్ నెం. 20, 21, 22 ల పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

జగనన్న పాలనలో పేదలకు ఉచితంగా స్థలాలు, ఇళ్ళు, సంక్షేమ పథకాలు, ఉచితంగా ఇంగ్లీష్ మీడియం విద్య, మెరుగైన వైద్యం, సామాజిక న్యాయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట, ఇంటి ముందుకు ప్రభుత్వ పరిపాలన, రైతులకు -కర్షకులకు- కార్మికులకు -మహిళలకు- యువతకు ప్రతి ఒక్కరికి మేలు జరిగింది : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ‌..

మన ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ చేసిన అభివృద్ధిని, సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలి.. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలకు తెలియజేయాలి.. చంద్రబాబు పాలనలో జరిగిన వివక్ష, దోపిడి, అవినీతి ని ప్రజలకు గుర్తు చేయాలి ..

సామాన్యులకు, పేదలకు, మధ్యతరగతి వారికి జగనన్న ప్రభుత్వం మంచి చేస్తుంటే చూసి ఓర్వలేక.. రాష్ట్రం దివాలా తీస్తుందని టిడిపి నేతలు గగ్గోలు పెడుతున్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచనతోనే తెలుగుదేశం నేతలు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

బూత్ స్థాయిలో ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో ప్రతి గడపకు వెళ్లి జగనన్న చేస్తున్న మంచిని వివరించి.. మరోసారి వైయస్ జగనన్నను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియచెప్పాలన్న శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

Related Posts

You cannot copy content of this page