SAKSHITHA NEWS

Youth wake up .. make your voice heard

యువత మేల్కొ .. నీ గళం వినిపించు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం తాళ్ళవలసలో గురువారం జరుగనున్న యువశక్తి భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్ర యువతను రెచ్చగొట్టెందుకే మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్నారనీ జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసారు.జనసేనాని పవన్ కళ్యాణ్ చేపడుతున్న యువశక్తి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.స్థానికంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జనసేన నేత కొణిదెల నాగబాబుతో కలిసి నాదెండ్ల మనోహర్ లు మాట్లాడారు.

మూడు జిల్లాల్లో ఉన్న జనసేన కార్యకర్తలు బాధ్యతతో ఈ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు.యువతకు వర్తమాన రాజకీయాల్లో మార్పు తెచ్చేది యువశక్తి అని అన్నారు.యువత దేశానికి వెన్నుముఖ అటువంటి యువత నేడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొరవడి తల్లడిల్లుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.యువత గోడు పాలకులకి పట్టకపోవడంతో వారు పడరాని పాట్లు పడుతున్నారని,ఉద్యోగాలు దొరకకా ఉపాధి కోసం ఎదురుచూపులు వారికి తప్పడం లేదని, ఈ క్రమంలోనే యువత కోసం జనసేన పార్టీ గళమెత్తనుందన్నారు. కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS