ఖమ్మం జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా యువనేత కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు.

Spread the love

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర యువ నేత కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా యువజన అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం..

అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా యువజన అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య ని అభినందించిన ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్.
ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ యువ నేత కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్లు వారు తెలిపారు. యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్నదానం కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని, యువజన విభాగం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువజన అధ్యక్షుడు కృష్ణ చైతన్య ని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యూత్ ఐకాన్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా పార్టీ పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ వైద్య సేవలు పొందెందుకు వచ్చిన 500 నిరుపేదలకు రుచికరమైన భోజనం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేతుల మీదగా ప్రారంభించి, అన్నదానూ చేయడం జరిగిందని వారు తెలిపారు.
నేడు కేటీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో ఒక బ్రాండ్ అని యువజన నాయకుడు చింతనిప్పు కృష్ణ చైతన్య తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా విదేశాల పెట్టుబడులు ఆకర్షిస్తూ తెలంగాణ గడ్డపై విఖ్యాత చెందిన ప్రముఖ కంపెనీలను ఆకర్షించి, పెట్టుబడులను ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత యువనేత కేటీఆర్ ని తెలిపారు. పార్టీ ప్రతిష్టతకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా దోహదం చేస్తూనే రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర మున్సిపల్ & పరిశ్రమ శాఖ మంత్రిగా ప్రత్యేక గుర్తింపు సాధించి తనదైన శైలిలో పనిచేస్తున్న యువ మంత్రిగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జిల్లా యువజన అధ్యక్షులు చింత నిప్పు కృష్ణ చైతన్య , తెలంగాణ ఉద్యమకారులు బొమ్మల రామ్మూర్తి , జడ్పిటిసి ప్రసాద్, పార్టీ నాయకులు ముత్యాల వెంకట అప్పారావు , అశ్విన్ , చామకూరి రాజు , యువజన విభాగం నాయకులు మరియు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page