కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శంకర్‌పల్లిలో జూనియర్ ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు: పామెన భీమ్ భరత్

Spread the love

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శంకర్‌పల్లిలో జూనియర్ ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు: పామెన భీమ్ భరత్

Whatsapp Image 2023 11 19 At 7.47.48 Pm

శంకర్‌పల్లి: నవంబర్ 19: (సాక్షిత న్యూస్): రాష్ట్రంలో, చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శంకర్‌పల్లి మండల కేంద్రంలో జూనియర్ ఇంటర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీమ్ భరత్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మండల పరిధిలోని జన్వాడ, మీర్జాగూడ, ఇంద్రారెడ్డి నగర్, అంతప్పగూడ, సంకేపల్లి, పర్వేద, లచ్చిరెడ్డిగూడ, కచ్చిరెడ్డి గూడ, కొత్తగూడ, గాజులగూడ, లక్ష్మారెడ్డిగూడ, ఆలంఖాన్ గూడెం, చిన్నారెడ్డిగూడ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

శంకర్‌పల్లి మండల కేంద్రం ప్రధాన చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శశికాంత్ ఆధ్వర్యంలో భీమ్ భరత్ ను గజమాలతో ఘనంగా సత్కరించారు. భీమ్ భరత్ మాట్లాడుతూ చేవెళ్ల నియోజక వర్గంలో విద్య, వైద్యం కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసి, అన్ని వర్గాల విద్యార్థులకు అధిక ప్రాధాన్యత కల్పింస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేకు కృషి చేస్తాం. చేవెళ్ల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సేవ చేస్తాం. చేవెళ్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. గత పదిసం వత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం, చేవెళ్లలో కొనసాగిన కుటుంబ పాలన, అవినీతి
భూకబ్జాలపై పోరాటం చేస్తాం. దేశఅభివృద్ధి కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి, ఉదయ్ మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, కాశీనాథ్ గౌడ్, ఇజాస్, సిద్దిక్ శరు, సమీ, మల్లేశం, రజనీకాంత్ గౌడ్, శ్యామ్, ప్రశాంత్, ఇజాస్, శ్రీధర్, బన్నీ, హరికుమార్, ప్రశాంత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ ముదిరాజ్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page