అర్హులైన వారందరికీ పింఛన్లు లను అందజేస్తాం

Spread the love

అర్హులైన వారందరికీ పింఛన్లు లను అందజేస్తాం..

వినుకొండ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామం కు చెందిన 30 మంది లబ్ధిదారులకు కొత్త ఫించన్ లు మంజూరు కాగా, వారికి గౌవ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు అర్హులైన వారందరికీ పింఛన్లు పంపిణీ చేయటం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా అర్హులైన వారికి వాలంటీర్లు వ్యవస్థ ద్వారా తెల్లవారు జామున నేరుగా ఇంటి వద్దకు వచ్చి పించన్ ను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా గత ప్రభుత్వం లో నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే అందించారు, ఎన్నికల 4 నెలల ముందు 2 వేల రూపాయల పింఛన్ ను అందించారని, కాని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లోకి వచ్చినప్పటి నుండి 2 వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం పెంచుకుంటూ 3వేల వరకు తీసుకెలుతూ ఉన్నారని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page