రూ.6.30 కోట్లతో 5 గ్రామాల రోడ్డు కష్టాలు తీరుస్తున్నాం

Spread the love

రూ.6.30 కోట్లతో 5 గ్రామాల రోడ్డు కష్టాలు తీరుస్తున్నాం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
88 తాళ్లూరు నుంచి పెదపాలెం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన

పెదకూరపాడు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు పూర్తి చేస్తున్నామని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. క్రోసూరు మండలం 88 తాళ్లూరులో రూ.6.30 కోట్ల PMGSY నిధులతో నిర్మిస్తున్న తారురోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ఈ రోడ్డు నిర్మాణంతో 88 తాళ్లూరు, అనంతవరం, ఉయ్యందన, మిట్టపాలెం, పెదపాలెం గ్రామాలకు రవాణా సమస్య తీరుతుందన్నారు.

9 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రోడ్డుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలకు కనీసం రోడ్లు వేయాలన్న ఆలోచన కూడా రాలేదని.. కానీ తాము నియోజకవర్గంలో దాదాపు అన్ని రోడ్లు పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వంలో రోడ్ల దుస్థితికి.. తమ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితికి తేడా ప్రజలు గమనించాలన్నారు. వారం రోజుల్లో నియోజకవర్గంలో రూ.16 కోట్ల విలువైన రోడ్లు పనులు ప్రారంభించామన్నారు. రెండు నెలల్లో వీటిని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నారు. బెల్లంకొండ – వన్నాయపాలెం రోడ్డు పనులు జరుగుతున్నాయని.. కొత్తపాలెం రోడ్డు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మాదిపాడు – పులిచింతల డ్యామ్ వరకు రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. నందిరాజుపాలెం రోడ్డు కూడా పూర్తి చేసి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోని గత ప్రభుత్వ పనితీరును, తమ ప్రభుత్వ పనితీరును గమనించి.. మంచి చేస్తున్న వారికి అండగా నిలవాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page