నిజాంపేట్ పరిధిలోని పలు కాలనీలలో గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు

Spread the love

నిజాంపేట్ పరిధిలోని పలు కాలనీలలో గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిరహించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ సందర్శించి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని నిర్వాహకులకు సూచించారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధన్రాజ్ యాదవ్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అద్యేక్షులు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులూ కోలన్ గోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్ సభ్యులు, మరియు కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page