శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరగాలి:

Spread the love

సాక్షిత : వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని వినాయకుల నిమజ్జనం కోసం ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ చెరువు ప్రదేశాన్ని పరిశీలించారు.

▪️నిమజ్జనం ప్రదేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

▪️ క్రైన్స్, బారికెట్స్, లైటింగ్, రోడ్డు క్లియరెన్స్, గజ ఈతగాళ్లు, వైద్య సిబ్బంది వారిని అందుబాటులో ఉంచుతూ… నిమజ్జనానికి కావలసిన ఏర్పాట్లన్ని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా… శాంతియుత వాతావరణంలో నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవిన్యూ శాఖ అధికారులు, R&B అధికారులు, ఫైర్ సిబ్బంది, వైద్యశాఖ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page