SAKSHITHA NEWS

వినాయక చవితి నిబంధనలు పాటిద్దాం

  • వినాయక చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సురేంద్ర కుమార్ రెడ్డి

….

సాక్షిత, తిరుపతి బ్యూరో: భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలనే ప్రతి మండపాల బృందాలు పోలీస్ పర్మిషన్ అవసరం లేకుండా ప్రభుత్వo విధించిన ఆంక్షలను పాటిస్తూ … వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని , వినాయక చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నేషనల్ టూరిజం శాఖ మాజీ డైరెక్టర్ తిరుమేర్ల సురేంద్ర కుమార్ రెడ్డి వెల్లడించారు. స్థానిక బొమ్మల క్వార్తర్స్ లో దాదాపు 500 విగ్రహాలను అనేక గ్రామాల నుంచి వచ్చిన మండప నిర్వాహక బృందాలకు పంపిణీ చేసే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకులు బాలుస్వామి, ఇస్కాన్ స్వామి, డాక్టర్ యుగంధర్, ఆనంద్ రెడ్డి, అవధూత పత్రిక ఎడిటర్ వెంకటరామిరెడ్డి, లాయర్ ప్రసాద్ రెడ్డి , రవికుమార్ లతోపాటు బొమ్మల క్వార్టస్ కార్మికుల సంఘం అధ్యక్షులు సతీ సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.


SAKSHITHA NEWS