*మైనారిటీ సోదరులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ ఆనంద్” *

Spread the love

సాక్షిత ; వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణ కేంద్రంలోని క్లబ్ ఫంక్షన్ హాల్ లో ముస్లీం మైనార్టీ సోదరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
ముస్లీం మైనార్టీలకు స్మశాన వాటిక మరియు ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు 3.4 (మూడు ఎకరాల నాలుగు గుంటల) స్థలాన్ని కేటాయిస్తూ… ప్రోసిడింగ్స్ అందజేశారు.
మునుపేన్నడు లేని విధంగా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, వికారాబాద్ లో ఫంక్షన్ హాల్ మరియు ముస్లింలకు స్మశాన వాటికకు స్థలం కేటాయించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page