చందానగర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో గల పలు సమస్యలు

Spread the love

మియాపూర్ డివిజన్ మరియు చందానగర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి మరియు GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి సమీక్షా సమావేశం జరిపిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజావసరాల దృష్ట్యా కాలనీ లలో నెలకొన్న సమస్యలను ప్రథమ ప్రాధాన్యత గా పరిగణలోకి తీసుకోని త్వరిత గతిన పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని, పనులలో వేగం పెంచాలని అలసత్వం ప్రదర్శిచకూడదని, పెండింగ్ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరం ఉన్న చోట కొత్త ప్రతిపాదనలు తీసుకోవాలని, ప్రజావసరాల దృష్ట్యా కాలనీ లలో వర్షాల వలన దెబ్బతిన్న రోడ్ల ను వెంటనే పునరుద్ధరించాలని, కాలనీ లలో త్వరితగతిన రోడ్ల ను వేయాలని అధికారులకు ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. ప్రజలకు ఎల్లవేళలలో అందుబాటులో ఉండి,క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పని చేయాలని, అన్ని కాలనీ లను సమగ్ర అభివృద్దే ధ్యేయంగా పని చేయాలని, కాలనీ లలో చేపడుతున్న పనులలో వేగం పెంచాలని,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు EE శ్రీకాంతిని ,AE శివ ప్రసాద్, AE ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page