SAKSHITHA NEWS

దేవరకొండ సాక్షిత ప్రతినిధి:
దేవరకొండ పట్టనికి చెందిన మాజిద్ మౌలాన ఈ సంవత్సరం హజ్ యాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, యంపీపి జాను యాదవ్, రైతుబంధు అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య గార్లతో కలిసి మౌలాన ని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ
హజ్ తీర్థయాత్ర ప్రతి ముస్లిం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన అంశమని అన్నారు.

ఈ యాత్ర ప్రతి మనిషిలో ఐక్యత, వినయం అల్లాహ్ పట్ల భక్తిని ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ యాత్ర సమాజంలో ఇస్లాం యొక్క ప్రధాన విలువలు బలోపేతం చేసే లోతైన అనుభవంగా పనిచేస్తుందని అన్నారు. ఇలాంటి గొప్ప అత్యంత పవిత్రత, అధ్యాత్మిక భావనతో చేస్తున్న హజ్ యాత్ర ప్రతి ఒక్క ముస్లిం జీవితంలో తప్పనిసరి చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రాయుతీలను కల్పిస్తూ ప్రోత్సహిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అబ్దుల్లా, మురళీ, యువజన నాయకులు ఖాదర్ బాబా, ఎనిమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS