బిఆర్ఎస్ పాలనలోనే నగర శివారు మున్సిపాలిటీలకు మహర్దశ :

Spread the love

బిఆర్ఎస్ పాలనలోనే నగర శివారు మున్సిపాలిటీలకు మహర్దశ : ఎమ్మెల్యే కేపీ వివేకానంద …

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నిర్వహించిన చేరికల కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మల్లంపేట్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నరహరి ఆధ్వర్యంలో పలువురు ఎమ్మెల్యే కే. పీ. వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కే. పీ. వివేకానంద మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నగరుశివారు మున్సిపాలిటీలలోని ప్రాంతాలలో రోడ్ల విస్తరణ, నూతన రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు మహర్ధశ లభించిందన్నారు. మనకోసం- మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే బిఆర్ఎస్ పార్టీని ముచ్చటగా మూడవసారి భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో 3వ నెంబర్ పై ఓటు వేసి అఖండ విజయాన్ని అందించాలని కోరారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : పోతురాజు ప్రభాకర్, తలారి రమేష్, ఎన్. పెంటయ్య, ఎం. హరీష్ వర్ధన్, టి. విజయ, ప్రేమ్ చంద్, షాద్ రాజ్, జిల్లా కుమారస్వామిలు….

Whatsapp Image 2023 11 16 At 1.00.56 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page