SAKSHITHA NEWS

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈరోజు దుందిగల్ మునిసిపాలిటీ భౌరంపేట్ లో పర్యటించడం జరిగింది . కొన్ని రోజులుగా హెచ్ఏండబ్లుఎస్ వాలు మంచి నీటి పైపులైన్ గురించి రోడ్లను తవ్వి నిర్మాణ పనులను కొన్ని కారణాల చేత అసంపూర్తిగా ఉంచారు. వాహనదారులకు , గ్రామస్తులకు పెద్ద సమస్య గా మారడంతో . ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారికి వివరించగా వెంటనే స్పందించి తన సొంత డబ్బులతో సుమారుగా రెండు లక్షాలా రూపాయల వెట్ మిక్స్ వేయించడం జరిగింది . సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీలైనంత త్వరలో రోడ్డును అందుబాటులో తెస్తామని అధికారులు తెలిపారు.* ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, ఏఈ సురేందర్ నాయక్, పలుపునూరి విష్ణు వర్ధన్ రెడ్డి , పాక్స్ డైరెక్టర్ భీమ్ రెడ్డి, సత్తిరెడ్డి, మహిపాల్ రెడ్డి ,మరియు సుధాకర్ రెడ్డి ,రాజు గౌడ్ ,ఆకుల యాదయ్య ,రాజిరెడ్డి ,బల్వంత్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS