నేడు గుర్రం జాషువా జయంతి

Spread the love

నేడు గుర్రం జాషువా గారి జయంతి

వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు నందు నేడు నవయుగ కవి చక్రవర్తి జాషువా గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొని జాషువా గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ, మన ప్రాంత వాసి నవయుగ కవి చక్రవర్తి అయిన గుర్రం జాషువా గారు, తన పదునైన కవిత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించి ఆలోచింపజేసిన కవి గుర్రం జాషువా గారు, అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుబడిన నవయుగ కవి చక్రవర్తి ఆయన. తెలుగు వారికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి రచనలు అందించిన కవి జాషువా గారు. పద్మ భూషణ్, కళా ప్రపూర్ణ, కవికోకిల, కవితా విశారద, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, నవయుగ కవి చక్రవర్తి ఇలా అనేక బిరుదులు వారి సొంతం.
వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దోహదపడుతుందని తెలిపారు..

Related Posts

You cannot copy content of this page