ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

Spread the love

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 27,96,000/- ఇరవై ఏడు లక్షల తొంబై ఆరు వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 27,96,000/- ఇరవై ఏడు లక్షల తొంబై ఆరు వేల రూపాయలు మంజూరి అయినవి అని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్ ,సత్యనారాయణ, శ్రీనివాస్ ,KRK రాజు, శ్రీహరి,కిరణ్, అప్పిరెడ్డి, స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page