రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Spread the love

గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని గుంటూరు జీజీహెచు తరలించారు. ప్రత్తిపాడు సీఐ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతులు మంగళగిరి వాసులుగా గుర్తించారు.

Related Posts

You cannot copy content of this page