వెనుకబడిన వర్గాల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం:-నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు

Spread the love

రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో నిర్వహించిన “బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.గ్రామంలో ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలు పడుతున్న బాధలను,కష్టాలను అడిగి తెలుసుకొని వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు.

గ్రామానికి విచ్చేసిన డా౹౹చదలవాడకు స్థానిక మహిళలు,ప్రజలు స్వాగతం పలికారు.జగన్ రెడ్డి పాలనలో ఏ ఒక్కరికి మనశ్శాంతి లేకుండా పోయిందని సామాన్య ప్రజలతో పాటు రైతులు, కాంట్రాక్టర్లు,వ్యాపారులు ఎవరూ సంతోషంగా లేరని ఇసుక, పెట్రోలు, డిజిల్, వంట గ్యాస్, వంట నూనె, వరకు అన్నీ ధరలు పెంచేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు.గాడి తప్పిన ఏపీని చక్కబెట్టగలిగిన సమర్ధత చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 03 At 7.03.57 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page