రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (బీసీ)ల సంక్షేమానికి పెద్దపీఠ వేస్తోంది,

Spread the love
రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (బీసీ)ల సంక్షేమానికి పెద్దపీఠ వేస్తోంది,
బీసీ కులవృత్తిదారులకు లక్ష రూపాయల చెక్కులు పంపిణీ పంపిణీ,
రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన (బీసీ) కులవృత్తిదారులు, చేతివృత్తిదారుల అభ్యున్నతికి, ఆర్థికంగా ఎదిగేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని దీనిలో భాగంగా లక్ష రూపాయల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అర్హులైన లబ్ధిదారులకు అందచేసే పథకానికి శ్రీకారం చుట్టారని ఇది ఎంతో సంతోషకరమని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
బోయినపల్లి మంత్రివర్యులు మల్లారెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమాధికారి కేశూరామ్తో కలిసి ప్రభుత్వం బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులకు చేయూతనిచ్చేందుకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం పథకానికి సంబంధించి చెక్కులను 71 మందికి మంత్రి మల్లారెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష ఆర్థిక సహాయం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని దీనిని సరిగ్గా వినియోగించుకొని వారు చేసే వృత్తికి సంబంధించిన ఆధునిక పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసుకొని ఉపాధి అవకాశాలను పెంపొందించుకొని ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాల ఆర్థికాభివృద్ధికై అనేక పథకాలు ప్రవేశపెట్టారని అందులో దళితుల కోసం దళితబంధు, గొల్లకుర్మలకై మేకలు, గొర్రెలు అందించడం, మత్స్యకారులకు దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసుకునేలా వ్యాన్లు, ద్విచక్ర వాహనాలతో పాటు పనిముట్లను సైతం అందించారన్నారు.
ప్రస్తుతం బీసీలకై లక్ష రూపాయల పథకం ప్రవేశపెట్టారని సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో అందరిని దృష్టిలో ఉంచుకొని ఆర్థికాభ్యున్నతి సాధించేలా పథకాల రూపకల్పన చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుక్షణం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పరితపిస్తుంటారని దేశంలోనే బెస్ట్ సీఎం కేసీఆర్ అని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు, ఉద్ఘాటించారు. ప్రస్తుతం లక్ష రూపాయల చెక్కులను 71 మందికి అందించడం జరిగిందని వీటిని సరిగ్గా వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని మంత్రి లబ్ధిదారులతో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి కేశూరామ్, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సంంధిత శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page