ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా సమయం లో ఆశా వర్కర్లు చేసిన సేవ అంత ఇంతా కాదు

Spread the love

ఆశా వర్కర్లుకు ఫిక్స్ డ్ వేతనం 18 వేలు ఇవ్వాలి

ఆశా వర్కర్లకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది

కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారు ఆశా వర్కర్లు కరోనా సమయములో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గ్రామాల్లో వాడ వాడలా తిరుగుతూ ప్రజలను చైతన్య వంతులను చేస్తూ ప్రజలకు సేవ చేసిన ఆశా వర్కర్లు ను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తు తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తారన్నారు.

వీటితో పాటు గర్భిణీ, బాలింతలు, చిన్నపిల్లలకు, ఇతర ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. పేరుగుతున్న ధరల కనుగుణంగా ఆశాలకు ఇస్తున్న పారితోషికాలను 18000 వేలు ఫిక్స్డ్ వేతనం
పెంచాలని, అదే విధంగా ఆశాలకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఆశా వర్కర్ల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నాం అని సీతక్క గారు అన్నారు

Related Posts

You cannot copy content of this page