సంక్షేమం కోసం పనిచేసే నాయకుడికి ఓటమి ఉండదని కుత్బుల్లాపూర్ ప్రజలు నిరూపించారు

Spread the love

సంక్షేమం కోసం పనిచేసే నాయకుడికి ఓటమి ఉండదని కుత్బుల్లాపూర్ ప్రజలు నిరూపించారు : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద


సాక్షిత : 125 – గాజుల రామారం డివిజన్ కైసర్ నగర్ కమిటీ హాల్ నందు ఓం మణికంఠ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్వర్యంలో నిర్వహించిన “అభినందన సభ” కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుల సంఘాల అభివృద్ధి, అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ హెయిర్ సెలూన్లకు ఆస్తి పన్ను మినహాయింపు వంటి వాటిని కల్పించామన్నారు. అంతేకాక ఎప్పటినుంచో అపరిష్కృతంగా మిగిలిన నాయి బ్రాహ్మణ సేవా భవనం శంకుస్థాపన చేసుకొని నిర్మాణం చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో కూడా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. సంక్షేమం కోసం పనిచేసే నాయకుడికి ఓటమి ఉండదని 85576 ఓట్ల మెజారిటీని కుత్బుల్లాపూర్ ప్రజలు నాకు అందించడమే ఇందుకు నిదర్శనమన్నారు.

అనంతరం నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదానికి గురైన నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యుడికీ వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించిన మంచి మనసున్న నేత ఎమ్మెల్యే కేపీ వివేకానందగారన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, మక్సూద్ బాయ్, ఎల్లా గౌడ్, కుత్బుల్లాపూర్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు జి. వెంకటేశ్వర్లు నాయి, ప్రధాన కార్యదర్శి విఎస్ఆర్ వెంకటేష్, కుత్బుల్లాపూర్ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page