ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోడ పత్రికను

Spread the love

The MLA who inaugurated the wall magazine organized under the auspices of Mudiraj Mahasabha…

ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే…


సాక్షిత : కుత్బుల్లాపూర్ ముదిరాజ్ మహాసభ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 21వ తేదీన ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం మరియు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పల్లె పల్లెకు ముదిరాజ్ జెండా – ముదిరాజ్ గుండెల్లో చైతన్య ఎజెండా గోడ పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

అదే విధంగా 21వ తేదీన కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గుమ్ముల స్వామి ముదిరాజ్, గుమ్మడి మధు సుదన్ రాజ్, తోడేటి సత్యం ముదిరాజ్, ఎల్.శ్రీనివాస్, కృష్ణ, తోట ప్రకాష్, దమ్మని శివ కుమార్, నర్సింహా, కే.విజయ్, జి.వెంకటేష్, కే.రాములు, సత్తయ్య, చింత మల్లేష్, రాయలపురం కృష్ణ, తలారి గణేష్, ఎస్.బాగయ్య, ఎం.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page