శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

Spread the love

The MLA visited Sri Venkateswara Swamy temple and offered special pooja

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ స్ప్రింగ్ విల్లా కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం కాలనీలో నెలకొన్న దోమల బెడద, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్, పార్క్ ల అభివృద్ధి, డంపింగ్ యార్డును వేరొక చోటకు మార్చాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే ని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలో ఆయా సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్, స్థానిక కార్పొరేటర్ మీనా సునీల్ రెడ్డి, దేవి చందు ముదిరాజ్ మరియు స్థానిక ఎన్ఎంసీ బీఆర్ఎస్ అధ్యక్షుడు, నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page