SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి

అనేక సంక్షేమ పథకాలతో జనం గుండెల్లో నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పోకల దేవదాసు అన్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా దేవదాస్ ఆధ్వర్యంలో చిట్యాల పట్టణంలోని తన కార్యాలయంలో వైయస్సార్ చిత్రపటానికి పూకల దేవదాసు పూల మాలలు వేసి నివాళులు నివాళులర్పించారు. అనంతరం దేవదాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ చేసిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకొచ్చారని ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు.
వ్యవసాయ రంగాన్ని విద్యారంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ఆర్ దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ రేముడాల లింగస్వామి, నాయకులు జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, జంపాల వెంకన్న, కందాటి రమేష్ రెడ్డి, ఎస్కే ఇబ్రహీం పాల శివకుమార్ పోకల యేసు రత్నం జిట్టా చిన్నస్వామి గంగాపురం గణేష్ ముత్తిరెడ్డి మాజీ సర్పంచ్ సూర్యపేట రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS