కొండముల గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం – ప్రతీ ఇంటికీ కలిశెట్టి” కార్యక్రమం

Spread the love

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం
రణస్టలం మండలం కొండముల గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం – ప్రతీ ఇంటికీ కలిశెట్టి” కార్యక్రమం నిర్వహించారు.జై కలిశెట్టి- జై తెలుగుదేశం అంటూ యువత నినాదాలతో మార్మోగింది ఎచ్చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు పొందూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు “ఇంటింటికీ తెలుగుదేశం – ప్రతి ఇంటికి కలిశెట్టి” మరియు బదుడే-బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు.గ్రామంలోని ప్రతి ఒక్క ఇంటికీ కలిశెట్టి అప్పలనాయుడు స్వయంగా వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించి వారి యోగక్షేమాలపై ఆరాతీసి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని గ్రామస్థులకు భరోసా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకుసంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు,సర్పంచులు,ఎంపీటీసీలు,మాజీ సర్పంచులు,మాజీఎంపీటీసీలు,కార్యకర్తలు,అభిమానులు,తెలుగుయువత, పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page