మిషన్ రాయలసీమ కార్యక్రమానికి భారీగా బయలుదేరిన తెలుగు తమ్ముళ్లు..

Spread the love

నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర సందర్భంగా మిషన్ రాయలసీమ కార్యక్రమం లో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లు బయలుదేరి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో 200 మందికి పైగా తెలుగు యువత కార్యకర్తలు కడప జిల్లాకు బయలుదేరి వెళ్లారు. ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు జెండా ఊపి వాహన శ్రేణిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ యువగళం పాదయాత్ర రాయలసీమ జిల్లాలు దాటి వెళుతున్న సందర్భంగా రాయలసీమ జిల్లా వ్యాప్తంగా నారా లోకేష్ వివిధ వర్గాల ప్రజల ద్వారా తెలుసుకున్న సమస్యలపై మిషన్ రాయలసీమ పేరుతో పార్టీ శ్రేణులు తప్పించి భవిష్యత్ కార్యాచరణ పై ఓ ప్రకటన చేస్తున్న నేపథ్యంలో తాము ఈ కార్యక్రమానికి వెళుతున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి యొక్క చంద్రబాబు నాయుడు తోనే సాధ్యం కాగలదని లోకేష్ వెంట యువత ఎంత ఉత్సాహంగా నడుస్తోందని తాము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావించి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నట్లు ఉమామహేశ్వర నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు..

Related Posts

You cannot copy content of this page