అశ్వారావుపేట నియోజక వర్గంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం

సాక్షిత న్యూస్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా అశ్వరావుపేట మరియు వినాయకపురం నారాయణపురం పేరాయి గూడెం వేదాంతపురం గ్రామ పంచాయతీలలో జరిగే పల్లె ప్రగతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి.శ్రీరామమూర్తి గారు. ఈ సందర్బంగా అశ్వారావుపేట లోని పంచాయతి కార్యాలయ సిబ్బంది నిర్వహించిన పల్లె ప్రగతి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికుల కు పాదపూజ నిర్వహించారు. ప్రతి ఒక్కరం ఈ రోజు ఆరోగ్యంగా ఉంటున్నాము, సూచీ శుభ్రత అన్ని మనకు ఉన్నాయంటే అది పారిశుధ్య కార్మికుల వాళ్ళనే అనీ కరోనా సమయంలో కూడా వారూ చేసిన సేవలను మరువలేనివి అని ఎంపీపీ గారు అన్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కెసీఆర్ గారూ నిర్వహిస్తున్న ఈ దశాబ్ది ఉత్సవాల వేడుకలలో భాగంగా ఈ రోజు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించు కున్నమని,దానిలో భాగంగా ఈ రోజు పారిశుధ్య కార్మికులకు పాద పూజ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ పంచాయతి పాలక వర్గ సభ్యులు అందరినీ పారిశుధ్య కార్మికుల అందరినీ సన్మనించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి గారు. అలాగే ప్రతి ఒక్క పంచాయతీలలో పారిశుధ్య కార్మికులకు యూనిఫాం లను పంపిణి చేయటం జరిగింది,అలాగే అన్ని గ్రామ పంచాయతీ లలో పంచాయతి సిబ్బందిని,పాలక వర్గ సభ్యులను సన్మాన కార్యక్రమాలు జరిగాయి.పారిశుధ్య కార్మికులు పాద పూజ చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జెడ్పీటీసీ చిన్నాంసెట్టీ.వరలక్ష్మి,జిల్లా brs పార్టీ అధికార ప్రతినిధి us ప్రకాష్ రావు,యువజన నాయకులు శెట్టిపల్లి. రఘురాం, ఎంపిడిఓ శ్రీనివాస రావు,అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ లు,ఎంపిటిసి లు, వార్డు సభ్యులు,కార్యదర్శులు, ఆశ వర్కర్లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page