మానవత్వం చాటుకున్న తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సంస్థ

Spread the love

మానవత్వం చాటుకున్న తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సంస్థ

సాక్షిత న్యూస్, గోదావరిఖని:

రామగుండం నియోజకవర్గ గోదావరిఖని పట్టణ కేంద్రం లోని విఠల్ నగర్ కు చెందిన గడ్డం సురేష్ కు కుమార్తె ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.
కుమార్తె ప్రణీత వయసు 8సంవత్సరాలు గత సంవత్సరo నుండి నరాల వ్యాధితో బాధపడుతుంది కాళ్లు మొత్తం పడిపోయాయి. ఆస్పత్రిలో చికిత్స చేసి జిబిఎస్ వ్యాధి అని తెలిపారు అప్పు చేసి ఇప్పటికే నాలుగైదు లక్షలు ఖర్చు చేశారు. ప్రణీత కు కొంత ఆరోగ్యం బాగుపడిన ఇంకా చికిత్స మిగిలే ఉంది, ఫిజియోథెరపీ మందుల ఖర్చు సుమారు నెలకు 50 వేల రూపాయలు ఖర్చవుతుంది ఇలా ఇంకా ఆరు నెలలు చేయాల్సి ఉంది.

లేదంటే పాపకు వైరస్ పెరిగే అవకాశం ఉంది. విషయం తెలుసుకుని స్పందించిన తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సంస్థ దాత కార్తీక్ సహకారంతో కీర్తిశేషులు సాయి శ్రీకర్ జయంతి సందర్భంగా పల్లెర్ల రమేష్ గౌడ్ చేతుల మీదుగా 2000 రూపాయలు సోమవారం ప్రణీతకు అందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా మిత్ర అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ, నీడ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page