SAKSHITHA NEWS

చంద్రబాబుతోనే మహిళా సాధికారిత
లక్ష్మీపురంలో ప్రదర్శన నిర్వహిస్తున్న తెదేపా శ్రేణులు

చంద్రబాబుతోనే మహిళా సాధికారిత సాధ్యమని తెదేపా రాష్ట్ర మహిళా కార్యదర్శి ముప్పిడి సుజాత అన్నారు.శనివారం లావేరు మండలం లక్ష్మీపురం గ్రామంలో మహాశక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు.తొలుత ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ తెదేపా మినీ మేనిఫెస్టో గురించి అవగాహన కల్పించారు.వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మహాశక్తి కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గం సమన్వయకర్త గంటా సంధ్య,టిడిపి కంటెస్టెంగ్ సర్పంచ్ బాసి గోవింద రెడ్డి,తెదేపా నేతలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS